హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంపై కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఏఐఎఫ్టీవో) ఉపాధ్యక్షుడు, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరారు. శనివారం కేరళలో జరుగుతున్న ఏఐఎఫ్టీవో జాతీయ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కొన్ని రాష్ర్టాలు సీపీఎస్ను రద్దుచేసినా ఎన్పీఎస్లోని సొమ్ము తిరిగి ఇవ్వబోమని కేంద్రం అనడం సరికాదని, ఆయా సొమ్మును తిరిగి రాష్ర్టాలు, ఉద్యోగుల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై జాతీయస్థాయిలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.