హైదరాబాద్ : ‘పోస్ట్బ్యాంక్’ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్భాటాలు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఆచరణలో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. గురువారం కరీంనగర్, హుజూరాబాద్, వరంగల్ పోస్టల్ శాఖ అధికారులు, ఉద్యోగులు వినోద్కుమార్తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పోస్టల్శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పోస్టల్ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విస్తృతమైన వ్యవస్థ కలిగిన పోస్టల్శాఖపై పట్ల ప్రజల్లో మంచి విశ్వాసం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో పోస్ట్బ్యాంక్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్భాటాలు చేసి చేతులు దులుపుకుందని ఆరోపించారు. తక్షణమే ఆ వ్యవస్థను ఆచరణలోకి తీసుకువచ్చి.. లావాదేవీలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పోస్ట్బ్యాంక్కు జాతీయ బ్యాంకులకు ఉన్న వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పోస్టల్ శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు, వారికి సంఘం కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు.