హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): వరి పంటకు సోకే అంటువ్యాధులపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) లోతైన పరిశోధనలు చేస్తున్నది. బ్యాక్టీరియా కారణంగా వరి పంటలో కలుగుతున్న మార్పులను పరిశోధకులు తేల్చనున్నారు.
బ్యాక్టీరియాల ద్వారా వచ్చే అంటువ్యాధులకు మ్యుటేషన్లు కారణంగా చెబుతున్నారు. దీంతో పంటల దిగుబడి కూడా ప్రభావితం అవుతుండగా తాజా పరిశోధనలు కీలకంగా కానున్నాయి. గ్జింతో మోనస్ ఓరైజేయే అనే మ్యుటేషన్ బ్యాక్టీరియల్ బ్లైంట్ వ్యాధిని కలిగిస్తుందని తేల్చారు.