నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 29: తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనంటూ అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థ లు, మండల పరిషత్తులు, సహకార సంఘాలు చేపట్టిన తీర్మానాల పరంపర మంగళవారం కూడా కొనసాగింది. కరీంనగర్ జిల్లాలోని వీణవంక ప్రాథమిక సహకార సంఘం పాలక వర్గం ఏకగ్రీవంగా తీర్మానించిన ప్రతులను ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి పంపించారు.
కరీంనగర్ : మానకొండూర్, వీణవంక
జగిత్యాల : కల్లెడ, పైడిమడుగు( కోరుట్ల), పెగడపల్లి
పెద్దపల్లి : బొమ్మారెడ్డిపల్లి, ఎర్రగుంటపల్లి (ధర్మారం), శానగొండ( ఓదెల)
సిరిసిల్ల : ఇల్లంతకుంట, వేములవాడ
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్
జయశంకర్ భూపాలపల్ల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ
రంగారెడ్డి : మంగల్పల్లి, పోల్కంపల్లి, యాచారం, దండుమైలారం, మంచాల.