పాలకుర్తి రూరల్, జూన్ 1 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను అణచివేయడంతోపాటు నిధులు ఇవ్వకుండా అడ్డుకొంటున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు తేవడంలో రాష్ట్ర బీజేపీ నాయకులు, ఎంపీలు విఫలమయ్యారని ఆరోపించా రు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రకటించిన ఉద్యోగాల మాట ఏమైందని ప్రశ్నించారు. కేంద్రంపై రా ష్ర్టాలు ఐక్యంగా పోరాడాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని విమర్శించారు. ఎన్నికల కోసం హిందూ ఏక్తా పేరుతో బండి సంజయ్, బీజేపీ నాయకులు హిందూ-ముస్లింల మధ్య మతకలహాలకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.