ఆదిలాబాద్ : జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో వెలసిన ఆదివాసీ మెస్రం గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా దేవతకు సోమవారం రాత్రి ఘనంగా పూజలు నిర్వహించి మెస్రం గిరిజనులు నాగోబా జాతర ను ప్రారంభించారు.
కాగా, అర్ధరాత్రి మెస్రం వంశీయులు నిర్వహించిన మహాపూజలకు జిల్లా కలెక్టర్ సిక్తాల పట్నాయక్. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు రేఖానాయక్, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఐటీడీఏ పీవో అంకిత్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, ఏఎస్పీ హర్షవర్ధన్,ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీటీసీ అర్కా పుష్పలత, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్ డొంగ్రే పాల్గొన్నారు.