నల్లగొండ : రాష్ట్రంలో బీసీ గురుకుల కళాశాలల ఏర్పాటుతో పాటు ఆరోగ్యశాఖలో 1828 స్టాఫ్ నర్సుపోస్టులకు నోటిఫికేషన్ వేయడాన్ని హర్షిస్తూ తెలంగాణలోని పలు జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల వద్ద బీఆర్ఎస్వీ (BRSV)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్ధుల కోసం 1001గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి అణగారిన విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిబాపూలే స్ఫూర్తితో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. విద్యార్థులందరికీ న్యూట్రీషన్ ఫుడ్ ను అందజేస్తూ విద్యార్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు కల్లూరి నవీన్ గౌడ్, మైనం మనోహర్, సాయికుమార్, అరవింద్, మనోజ్ కుమార్, శ్యామ్, పవన్ కుమార్, గణేష్, సీహెచ్ శివకుమార్, వి.కిరణ్, ప్రశాంత్, శంకర్, గోపాల్, లింగస్వామి, వెంకన్న, నరేష్, శ్రీశైలం, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి ..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు బీసీ ప్రభుత్వ డిగ్రీ గురుకుల కళాశాలను మంజూరు చేయడంపై బీ ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో సీఎం కేసీఆర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.