కంది : సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (ఓడీఎఫ్)లో కొత్త టెక్నాలజీతో తయారు చేసిన సీసీపీటీ యుద్ధ ట్యాంకర్లను ఓడీఎఫ్ సీజీఎం సుధాకర్ సోమవారం ఆవిష్కరించి ఆర్మీకి అప్పగించారు.
ఈ సందర్భంగా సీజీఎం మాట్లాడుతూ.. వ్యూహాత్మక, సాంకేతిక అగ్ని నియంత్రణ విధుల కోసం ఈ యుద్ధ ట్యాంకర్లను ప్రత్యేకంగా రూపొందించినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ అధికారులు పాల్గొన్నారు.