హైదరాబాద్, అక్టోబర్1 (నమస్తే తెలంగాణ): వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పా టు చేసే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనార్టీలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని గురువారం వర్చువల్గా నిర్వహించగా మంత్రి కొప్పుల పెద్దపల్లి నుంచి పాల్గొని మాట్లాడారు. వయోవృద్ధులకు ప్రతి జిల్లాలో ఆశ్రమాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, తొమ్మిదిచోట్ల పనులు కొనసాగుతున్నాయని, డే కేర్ సెంటర్లలో టీవీలు, ఇండోర్ గేమ్స్ ఆడుకునేందుకు ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలో సేవాభావంతో ముందుకు సాగుతున్న ట్రస్టులు, సంస్థల ఆధ్వర్యంలో 267 ఆశ్రమాలు ఉండడం సంతోషదాయకమని అన్నారు.