హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): దోమల వృద్ధిని నియంత్రించడం ద్వారా రోగాల వ్యాప్తిని అరికట్టడంపై హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు దృష్టి సారించారు. అందులో భాగంగా వాటి జీవితచక్రాన్ని అధ్యయనం చేసేందుకు మైక్రో సీటీ స్కా నింగ్ విధానాన్ని ఉపయోగించారు.
లార్వా దశ నుంచి సంతోనోత్పత్తి దశకు చేరేవరకు దోమల శరీర వ్యవస్థలో జరిగే మార్పులను హైరిజల్యూషన్ చిత్రాలతో లోతుగా తెలుసుకోవడం ద్వారా వాటి నియంత్రణకు అడ్డుకట్ట వేసేందుకు వీలుంటుందని గుర్తించారు. డ్రోసోఫిలా లాంటి కీటకాలతో పోలిస్తే దోమల కండరాల వృద్ధిలో తేడా ఉన్నట్టు కనుగొన్నారు. సీసీఎంబీ సీనియర్ సైంటిస్ట్ ధనుంజయ్ చతుర్వేది ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధన ఫలితాలను ‘సైన్స్ డైరెక్ట్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.