హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగా ణ): ఇంటర్మీడియట్ సంస్కరణల్లో భాగంగా ఈ విద్యాసంవత్సరం ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ ప్రాక్టికల్స్పై పలు రాష్ర్టాలు ఆసక్తి చూపిస్తున్నాయి. రాష్ట్రం లో తొలిసారిగా ఈ నెల 16న ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.
ఈ విధానాన్ని ఇప్పటివరకు మణిపూర్, పంజా బ్, బీహార్, సిక్కిం రాష్ర్టాలు ప్రశంసించాయి. ఇంటర్బోర్డు నుంచి వివరాలు కోరాయి. ప్రత్యేకించి విద్యార్థుల్లో మన దగ్గర సంభాషణ నైపుణ్యాలు పెంచేందుకు చేపట్టిన ఇంగ్లిష్ ల్యాబ్ సహా పలు చర్యలపై సీబీఎస్ఈ ఆరా తీసింది.