హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి కెమిస్ట్రీ ప్రశ్నపత్రం మధ్యస్తంగా రావడంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు. ఎప్పుడూ విద్యార్థులను కంగారుపెట్టే కెమిస్ట్రీ పేపర్ ఈసారి అంత కఠినంగా లేదని విద్యార్థులు, టీచర్లు అభిప్రాయపడ్డారు.
మంగళవారం సీబీఎస్ఈ 12వతరగతి కెమిస్ట్రీ పరీక్ష నిర్వహించారు.