హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సోమవారం రాలేనని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. తన తల్లి దవాఖాన నుంచి తన తల్లి డిశ్చార్జ్ అయిన తర్వాతే వస్తానని చెప్పారు. లేఖపై రాత్రి స్పందించిన సీబీఐ.. రెండు సార్లు రాలేదని, ఇప్పుడు విచారణకు వచ్చి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.