నాంపల్లి కోర్టులు, జూన్ 24 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో చార్జిషీట్ దాఖలుకు సీబీఐ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డితో భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డి రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉన్నారు. ఎంపీ అవినాశ్రెడ్డి ముందస్తు బెయిల్పై ఉన్నారు. ఇప్పటివరకు చేపట్టిన విచారణ ఆధారంగా చార్జిషీట్ దాఖలు చేసి కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలనే యోచనతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. సోమవారం కోర్టు ఎదుట చార్జిషీట్తో పాటు సాక్ష్యాధారాలను కూడా సమర్పించాలని యోచిస్తున్నారు. హత్య జరిగిన ప్రాంతంలో సేకరించిన కీలక ఆధారాలను, సీసీ పుటేజీ ఫొటోలను, మొబైల్ డేటాను, సాక్షుల వాంగ్మూలాలను సమర్పించనున్నారు.