Laxmi Narayana | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) కు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ( Laxmi Narayana ) ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ( Telangana ) నుంచి ఒక బృందాన్ని పంపి.. వైజాగ్ స్టీల్ ఈవోఐలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నందుకు కేసీఆర్ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కేసీఆర్ నిర్ణయంతో విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వెళ్లకూడదని, ఆర్ఐఎన్ఎల్ను బలోపేతం చేయాలని కేంద్రం ఆలోచించడానికి కారణమైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్లో పాల్గొనాలని లక్ష్మీనారాయణ సూచించారు.
కేసీఆర్ పోరాటంతో విశాఖ స్టీల్ ప్లాంట్( Vizag Steel Plant ) ప్రయివేటీకరణపై కేంద్రం వెనుకడుగు వేసిన సంగతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని కేంద్రమంత్రి ప్రకటించారు. ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు.
శ్రీ కేసీఆర్ #KCR గారికి ధన్యవాదాలు, ఒక బృందాన్ని పంపడం ద్వారా వైజాగ్ స్టీల్ ఈఓఐలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నందుకు . ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రస్తుతానికి ప్రైవేటీకరణకు వెళ్లకూడదని , RINLని బలోపేతం చేయలని ఆలోచించడానికి కారణం అయ్యింది . తెలంగాణ ప్రభుత్వం బిడ్లో పాల్గొనాలి.
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) April 13, 2023