హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చే సింది. ఈ క్రమంలో ఈ కేసులో నిందితులుగా ఉన్నవారికి హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు నిందితులుగా ఉన్న అరుణ్రామచంద్ర పిైళ్లె, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాస్రెడ్డిలకు గురువారం సీబీఐ నోటీసులు ఇచ్చింది.
16న విచారణకు రావాలని పే ర్కొన్నది. ‘లీగల్ టీమ్తో డిసస్ చేస్తు న్నాం. అధికారులకు సహకరిస్తా’ అంటూ కవిత ఎక్స్లో ట్వీట్ చేశారు.