దుండిగల్, ఫిబ్రవరి 5: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజులరామారం సర్కిల్ సూరారంలోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ‘క్యాథ్ల్యాబ్’ను జాతీయ ఒలింపిక్ షూటర్, అర్జున అవార్డు గ్రహీత ఈషాసింగ్తో కలిసి మేడ్చల్ ఎమ్మెల్యే, మల్లారెడ్డి హెల్త్ సిటీ ఫౌండర్ చైర్మన్ సీహెచ్ మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. వైద్యశాలలో అత్యాధునిక క్యాథెటరైజేష న్ లాబోరేటరీ (క్యాథ్ల్యాబ్)ను ఏర్పాటు చే యడం అభినందనీయమన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లోనే ఇది మొట్టమొదటిదని తెలిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో నారాయణ మల్లారెడ్డి వైద్యశాల ముందున్నదని, అధునాతన పరికరాల సహాయంతో రోగులకు సత్వర, కచ్చితమైన రోగ నిర్ధారణ, వైద్యం అందిస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యశాల చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ప్రీతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.