వనస్థలిపురం, జనవరి 7: ఓ ఎన్నారైకి భూమి ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేశారన్న ఫిర్యాదుపై అంబర్పేట సీఐ సుధాకర్పై వనస్థలిపురం పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన విజయ్నాథ్ అమెరికాలో నివాసముంటున్నారు. హైదరాబాద్ చెందిన ఆర్ఐ రాజేశ్ (సస్పెన్షన్), అంబర్పేట సీఐ సుధాకర్ ఏడాది కిందట రంగారెడ్డి జిల్లా కందుకూరు సమీపంలో భూమి ఇప్పిస్తామని విజయనాథ్ నుంచి ఆన్లైన్ ద్వారా రూ.51 లక్షలు, నగదు రూ.3 లక్షలు తీసుకొన్నారు. భూమిని చూపించకుండా, రిజిస్ట్రేషన్ చేయించకుండా దాటవేస్తుండటంతో బాధితుడు