ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 14: ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మావల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ఓ కారులో మంటలు చెలరేగాయి. ఇందులో ప్రయాణిస్తున్న తల్లీకూతురు త్రుటిలో తప్పించుకొన్నారు.
ఆదిలాబాద్లోని టీచర్స్ కాలనీకి చెందిన రంగినేని శిల్ప తన కూతురు మోక్షను మావల మండల కేంద్రంలోని స్కూల్ నుంచి కారులో తీసుకొని వస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన శిల్ప తన కూతురుతో కలిసి వెంటనే కారు నుంచి బయటికి వచ్చేశారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు వచ్చి మంటలను ఆర్పివేశారు.