నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి వద్ద జాతీయ రహదారిపై టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడు, క్షతగాత్రులను మోర్తాడ్ మండలం పాలెం వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.