హైదరాబాద్: నగర శివార్లలోని హైదర్షాకోట్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం (Car accident)సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
సన్సిటీ నుంచి మెహదీపట్నం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. పొగమంచు కారణంగా రోడ్డు కనబడకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని అహ్మద్, షేక్ మతీన్, సోహేల్, ఫైసల్గా గుర్తించారు. వారంతా బహదూర్పురా ప్రాంతానికి చెందినవారని వెల్లడించారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.