కంటోన్మెంట్, డిసెంబర్ 16: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన స్వచ్ఛ ఛావణి అవార్డుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ముందు వరుసలో నిలిచింది. అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2023లో భాగంగా రక్షణ శాఖ ప్రకటించిన అవార్డుల్లో ఏ- క్యాటగిరీ ‘ఈ-చావణి’ అవార్డుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎంపికైంది. పరిశుభ్రత విషయంలో కంటోన్మెంట్లలో సికింద్రాబాద్కు ఏ- క్యాటగిరీ దక్కించుకున్నది. బీ- క్యాటగిరీలో థామస్ మౌంట్ కమ్ పల్లవరం, సీ-కేటగిరీలో జుటోగ్ కంటోన్మెంట్ నిలిచాయి. ఈ అవార్డులకు ఎంపికైన కంటోన్మెంట్ బోర్డు అధికారులకు డిఫెన్స్ ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.