హైదరాబాద్, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని పేరును అచ్చంపేట నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా నుంచి తొలగించకపోవడాన్ని సవాల్ చేసిన వ్యా జ్యంలో ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. నాగర్కర్నూలుకు చెందిన కే దేవ దాఖలు చేసిన పిటిషన్లో జోక్యం చేసుకోలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరథే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్ను డిస్మిస్ చేసింది. యశస్విని గెలిస్తే నామినేషన్ ఆమోదం చట్ట విరుద్ధంగా జరిగిందని ఎలక్షన్ పిటిషన్ దాఖ లు చేసుకోవచ్చునని స్పష్టం చేసి ంది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున ఈ వివాదంలో జోక్యం చేసుకోబోమని పేర్కొంది.