హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ ఏడీజీ మహేశ్ భాగవత్ దగ్గర సివిల్స్ ఇంటర్యూ కోసం శిక్షణ పొందిన అభ్యర్థులు సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. టాప్-100లో సుమారు 15 మంది అభ్యర్థులు నిలిచారు. వరుసగా 3, 5, 9, 16, 39, 42, 50, 51, 61, 67, 74, 80, 81, 82, 100 ర్యాంకులు సాధించారు. మంగళవారం అభ్యర్థులు డీజీపీ కార్యాలయంలో ఏడీజీ మహేశ్ భాగవత్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
సివిల్స్ ఫలితాల్లో రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి సివిల్స్ శిక్షణ పొందినవారిలో కే ప్రణయ్కుమార్ 554వ ర్యాంకు, కే శశికాంత్ 891 వ ర్యాంకుతో అర్హత సాధించారు. దీంతో వారికి ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ శ్రీధర్ అభినందనలు తెలిపారు. ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి ఐదుగురు ఇంటర్వ్యూ వరకు అర్హత సాధించినట్టు టీఎస్ఎస్సీఎస్సీ డైరెక్టర్ పేర్కొన్నారు. వీరిలో ప్రణయ్కుమార్, శశికాంత్ ర్యాంకులు కైవసం చేసుకున్నట్టు చెప్పారు.