హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. జనవరి 11, 12 తేదీల్లో విజయవాడ – భద్రాచలం రోడ్(07979), భద్రాచలం రోడ్ – విజయవాడ(07278), సికింద్రాబాద్ – వరంగల్(07462), వరంగల్ – హైదరాబాద్(07463) ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు.
ఇక ఎంఎంటీఎస్ రైళ్ల విషయానికి వస్తే.. లింగంపల్లి – హైదరాబాద్, హైదరాబాద్ – లింగంపల్లి, ఫలక్నూమా – లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్నూమా, రామచంద్రపురం – ఫలక్నూమా, ఫలక్నూమా – రామచంద్రపురం, ఫలక్నూమా – హైదరాబాద్ మధ్య రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Cancellation of Passenger and MMTS Trains pic.twitter.com/RuX3ewtDG2
— South Central Railway (@SCRailwayIndia) January 11, 2023