హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అమలు, ఉద్యోగుల కేటాయింపునకు జారీచేసిన జీవో-317 బాధితుల సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది. రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ను ఈ కమిటీలో సభ్యులుగా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. జీవో-317, జీవో-46తో తలెత్తిన సమస్యలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించారు.