హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : జీవో -317 సమస్యలపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన క్యాబినెట్ సబ్కమిటీ గురువారం సాయంత్రం ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ కానున్నది. మంత్రులు దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబుతో కూడిన కమిటీ సచివాలయంలో సమావేశంకానున్నది. దీనికి అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు హాజరుకావాలని జీఏడీ సెక్రటరీ కే నిర్మల ఆదేశించారు.