జనగామ : జనగామ జిల్లా పరిధిలోని వడ్లకొండ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు గ్రామస్తుల సమక్షంలో ఆదివారం తీర్మానం చేశామని సర్పంచ్ బొల్లం శారద తెలిపారు. గ్రామంలో ఉన్న బెల్టు షాపుల్లో ఈ నెల 13 నుంచి పూర్తిగా మద్యం అమ్మకాలు చేపట్టవద్దని, ఎవరైనా మద్యం అమ్మకాలు చేపడితే రూ. 25వేల జరిమానా విధిస్తామని చెప్పారు.
అమ్మకాలు జరిపినట్లు గ్రామస్తులు తెలిపితే వారికి రూ. 10వేల బహుమతి అందజేస్తామని తీర్మానం చేసినట్లు తెలిపారు. మద్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొందరు గొడవలు పెట్టుకుని పోలీస్ స్టేషన్ వరకు వెళ్తున్నారని గుర్తించి పూర్తిగా మద్యపానాన్ని నిషేధించామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాజె అనిల్, వార్డుసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బహుజన తత్వవేత్త జ్యోతిరావు పూలే : మంత్రి పువ్వాడ
‘మల్లన్న’ క్షేత్రంలో భక్తుల కోలాహాలం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే : మంత్రి ఐకే రెడ్డి
గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు ఫూలే