హుస్నాబాద్, అక్టోబర్ 29: ఒక్కో ఎమ్మెల్యేను వంద కోట్లు ఇచ్చి కొనుగోలు చేయడం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. తాను అసెంబ్లీ ఫ్లోర్లీడర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో చేసిన ప్రసంగాలపై రూపొందించిన పుస్తక పరిచయ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం హుస్నాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉండి వాటి పరిష్కారం కోసం కృషి చేసే వాడే నిజమైన నాయకుడని, ఆ దిశగా తాను అసెంబ్లీలో ప్రసంగాలు చేశానని తెలిపారు.