హైదరాబాద్ : జూబ్లీ బస్స్టేషన్ (జేబీఎస్)లో యూపీఐ, క్యూఆర్కోడ్ చెల్లింపుల ద్వారా టికెట్లు ఇచ్చే నూతన సేవలను ప్రారంభించినట్టు టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే సికింద్రాబాద్లోని రేతిఫైల్, హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్స్టేషన్ (ఎంజీబీఎస్)లోని టికెట్ బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్, పార్సిల్, కార్గో కేంద్రాల్లో ఈ తరహా సేవలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ, స్పందన లభించడంతో జేబీఎస్లో సైతం ప్రారంభించినట్టు వెల్లడించారు. ప్రయాణికులు తమ సలహాలు, సూచనలు @tsrtcmdoffice అకౌంట్కు ట్విట్టర్లో తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.