హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సచివాలయంలోని తన కార్యాలయంలో బుర్రా వెంకటేశంను ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు, తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ రాజభాను చంద్రప్రకాశ్, ప్రధానకార్యదర్శి ఆర్ రాజుగంగారెడ్డి, కోశాధికారి బీ తుకారంలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాల నేపథ్యం నుంచి వచ్చిన తనకు విద్యాశాఖలో పనిచేయడం ఆనందంగా ఉన్నదని బుర్రా వెంకటేశం చెప్పారు. తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.