నిజామాబాద్ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వైఖరిపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. అసత్య ఆరోపరణలు చేస్తున్న అరవింద్ దిష్టిబొమ్మలను ఆర్మూర్, మోపాల్, నిజామాబాద్ నగరంలో పలువురు దళిత సంఘాల నాయకులు దహనం చేశారు.
సీపీ నాగరాజుపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఐపీఎస్ అధికారి నాగరాజుకు క్షమాపణ చెప్పాలంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ను దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మొన్న జరిగిన ఆర్మూర్ మండలం ఇస్సపల్లి ఘటనలో సీపీ నాగరాజుపై హత్యా ఆరోపణలు చేయడంపై దళిత నాయకులు మండిపడుతున్నారు. ఇకనైనా అరవింద్ తన తీరు మార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.