నిజామాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మను జాగృతి నాయకులు దహనం చేశారు. నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చౌక్ లో ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాగృతి నాయకులు మాట్లాడుతూ ఎంపీ అరవింద్ కు దమ్ముంటే రాజీనామా చేసి ఎమ్మెల్సీ కవితపై పోటీ చేసి గెలవాలని డిమాండ్ చేశారు.
ఇన్నాళ్లు ఎమ్మెల్సీ కవిత సహనాన్ని పరీక్షించారని ఇక ప్రజలు ఊరుకోరని స్పష్టం చేశారు. ఇకనైనా అరవింద్ తీరు మార్చుకోకుంటే అన్ని గ్రామాల్లో అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. పసుపు రైతులను మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న అరవింద్ కు ఎమ్మెల్సీ కవిత పై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. జిల్లాలో ఎక్కడ పర్యటించినా అరవిందును అడ్డుకొని తీరుతామని చెప్పారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు మతి లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జాగృతి జిల్లా కన్వీనర్ అవంతి రావు, నరాల సుధాకర్, టీఆర్ఎస్ నేతలు ప్రభాకర్, అలీం తదితరులు పాల్గొన్నారు.