నిజాం కాలంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించి.. కాలక్రమేణా చెత్త డంప్గా మారిన బన్సీలాల్పేట మెట్లబావి మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రత్యేక చొరవతో కొత్తరూపు సంతరించుకొన్నది. దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం మెట్ల బావి పక్కనే నిర్మించిన టూరిజం ప్లాజా గార్డెన్, బావి లోపల ఏర్పాటు చేసిన లైటింగ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. సోమవారం సాయంత్రం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి మంత్రి కేటీఆర్ ఈ మెట్లబావిని ప్రారంభించనున్నారు. – బేగంపేట్