హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): బీసీ స్డడీ సర్కిళ్ల బడ్జెట్ను పెంచి.. పేద బీసీ విద్యార్థులకు బ్యాంకింగ్, జీఆర్ఈ, ఐఎల్ఈటీఎస్ వంటి పోటీ పరీక్షల్లో కూడా శిక్షణ ఇప్పించాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్కు వినతిపత్రం అందజేశారు. బీసీ బంధును విస్తరించాలని, నామినేటెడ్ పోస్టులో 50 శాతం బీసీలకు కేటాయించాలని, బీసీ భవన్ను నిర్మించాలని, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ కోర్సుల సాలర్షిప్లను పెంచాలని కోరారు.
అసెంబ్లీ, సెక్రటేరియట్, ప్రతి జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం ప్రధాన కార్యదర్శి రవి కుమార్ చారి, కార్యదర్శి రవీందర్ యాదవ్, హేమంత్, కృష్ణ, సాయి వర్ధన్ తదితరులు ఉన్నారు.