నాగార్జునసాగర్లో నిర్మిస్తున్న బుద్ధవనం తెలంగాణకు మణిహారంగా నిలువనున్నది. ఈ నెల 14న మంత్రి కేటీఆర్ బుద్ధవనంను సందర్శించనున్నారు.
ప్రపంచం అబ్బురపడేలా వివిధ రకాల శిల్పాలు, బౌద్ధ్ద అవశేషాలతో కూడిన నిర్మాణాలు, బౌద్ధ స్థూపాల నమూనాలు, మహాస్థూప నిర్మాణాన్ని కేటీఆర్ పరిశీలిస్తారు. కేటీఆర్తో పాటు మంత్రులు జగదీశ్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి నాగార్జునసాగర్కు రానున్నారు.