హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 31: వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో సీటు పొందేందుకు మహారాష్ట్రకు చెందిన విద్యార్థిని యత్నించింది. ఆమెకు 5 లక్షల ర్యాంకు వస్తే, 50 వేలు వచ్చినట్టు మార్పిడి చేయించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో అధికారులకు పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. నిట్లో అన్ని మొదటి సంవత్సర ప్రోగ్రామ్లకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. బీటెక్ అడ్మిషన్ కోసం బుధవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియకు మహారాష్ట్రకు చెందిన విద్యార్థిని హాజరైంది. ర్యాంకు కార్డు, నిట్ అలాట్మెంట్ పత్రాలు నకిలీవిగా అధికారుల తనిఖీల్లో బయటపడింది.
ఈ వ్యవహారంపై నీట్ అధికారులు సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీఎస్ఏబీ)కు నివేదించారు. ఫోర్జరీ పత్రాలు తీసుకొచ్చిన విద్యార్థినిపై కేసు నమోదు చేయించాలని ఆదేశించారు. వరంగల్ నిట్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పటిష్టంగా నిర్వహిస్తున్నట్టు, విద్యార్థులు ఇలాంటి నకిలీ సర్టిఫికెట్ల బారిన పడవద్దని, ఎవరిని నమ్మవద్దని వరంగల్ నిట్ అకడమిక్ డీన్ ప్రొఫెసర్ శరత్బాబు సూచించారు. వరంగల్ నిట్కు మంచి గుర్తింపు ఉండటంతో అడ్మిషన్లకు పోటీ ఉంది. ఇందులో సీటు వస్తే, కొలు వు ఖాయమని విద్యార్థులు భావిస్తుంటారు.