హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నపాటి అనారోగ్యానికి గురైతే బీజేపీ ఎంపీ బండి సంజయ్ చిల్లర వెటకారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
మానసిక దౌర్బల్యంతోనే సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఏ సనాతన ధర్మం ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయాలని చెప్పిందని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ (ఎక్స్) చేశారు.