KTR | తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (TJF) రజతోత్సవ సంబురాల పోస్టర్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన టీజేఎఫ్.. 25 వసంతాల సంబురాలు జరుపుకోవడం ఎంతో గర్వకారణమని అన్నారు.
దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల విముక్తి కోసం కేసీఆర్ సారథ్యంలో సాగిన మలి దశ ఉద్యమంలో ప్రజలను చైతన్య పరచడంలో తెలంగాణ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని కేటీఆర్ గుర్తుచేశారు.
తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఎన్నో రకాల కార్యక్రమాలు అమలు చేశామని, టీజేఎఫ్కి తాము ఎప్పటికీ అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ నెల 31వ తేదీన జలవిహార్లో నిర్వహిస్తున్న రజతోత్సవాలకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు పెద్దఎత్తున తరలిరావాలని ఈ సందర్భంగా అల్లం నారాయణ కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, టెంజు ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, టీయూడబ్ల్యూజే కోశాధికారి పి.యోగానంద్, టీయూడబ్ల్యూజే హైదరాబాద్ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు రాకేశ్ రెడ్డి, సోమేశ్, కోశాధికారి బాపు రావు, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్, చిక్కులు శ్రీనివాస్, ప్రవీణ్, సతీశ్, దిలీప్, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.