KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో ఓ హత్య కేసులో దుబాయ్లో జైలుశిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి లభించింది. నేపాల్కు చెందిన వాచ్మెన్ బహదూర్సింగ్ హత్య కేసులో ఐదుగురు సిరిసిల్ల వాసులకు జైలుశిక్ష పడింది. ముందుగా పదేళ్ల జైలుశిక్ష వేసిన దుబాయ్ కోర్టు ఆ తర్వాత 25 ఏళ్లకు వారి జైలుశిక్షను పొడిగించింది. ఇప్పటికే 18 ఏళ్ల జైలుశిక్ష అనుభవించారు. మరో ఏడేళ్లు శిక్ష అనుభవించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవ తీసుకున్నారు. నేపాల్కు వెళ్లి హత్యకు గురైన బహదూర్సింగ్ కుటుంబసభ్యులకు రూ.15 లక్షల పరిహారం అందజేశారు. అనంతరం వారితో క్షమాభిక్ష పత్రం రాయించారు. అయితే మారిన నిబంధనల మేరకు హతుని కుటుంబం క్షమాభిక్ష పెట్టినా.. వారిని విడుదల చేసేందుకు దుబాయ్ కోర్టు అంగీకరించలేదు.
దాంతో తెలంగాణవాసుల తరఫు న్యాయవాదులు అనారోగ్య కారణాలు చూపుతూ మరోసారి వారి విడుదలకు ప్రయత్నించారు. దాంతో అనారోగ్య కారణాల రీత్యా వారిని ఏడేళ్లు ముందుగానే కోర్టు వారిని విడుదల చేసింది. దాంతో వారు దుబాయ్ నుంచి సిరిసిల్లకు చేరుకున్నారు. 18 ఏళ్ల తర్వాత కుటుంబసభ్యులను కలుసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.