హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) గురువారం ఉదయం కొల్లాపూర్కు బయలుదేరారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి(Sridhar Reddy) హత్యకు గురైన నేపథ్యంలో వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న కేటీఆర్ పరామర్శించనున్నారు. కేటీఆర్ వెంట శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గువ్వల బాలరాజు, మన్నె క్రిశాంక్, పలువురు నేతలు ఉన్నారు.
కాగా, వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్రెడ్డి (45) దారుణహత్యకు గురయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో గత అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రిపూట ఆరుబయట నిద్రిస్తున్న ఆయనను గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో తల నరికి చంపేశారు.
కొల్లాపూర్కు బయల్దేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు హత్యకు గురైన నేపథ్యంలో వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న కేటీఆర్.
కేటీఆర్ వెంట… pic.twitter.com/jkXgo7iqme
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2024