హైదరాబాద్ : ఇవాళ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ను ఓ ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల గురించి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి కేబెనెట్లోనే ఆరుగ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇవాళ మాట తప్పిందన్నారు. ఆరు కాదు రెండు గ్యారంటీలు మొదటి రోజు చేశామన్నారు.. కానీ రెండింటిలో పావలా వంతు కూడా అమలు చేయలేదన్నారు.
మహా లక్ష్మి పథకం కింద తెలంగాణలోని మహిళలకు రూ.2500 ఇస్తామన్న హామీ ఏమైంది?.. ఇంటింటికి రూ.500 కే గ్యాస్ సిలిండర్ హామీ ఏమైంది. ఇవి మొదటి రోజు మీరు సంతకం చేసిన రెండు గ్యారంటీల్లోనివేనని సీఎం రెవంత్కు గర్తు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పిన మీరు ఇవాళ కేవలం పల్లెవెలుగు, సిటీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే అమలు చేస్తున్నారని, సూపర్ లగ్జరీ, గరుడ బస్సుల్లో ఎందుకు ఉచిత ప్రయాణం అనుమతించట్లేదని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మెగా డీఎస్సీ వేస్తామన్నారు.. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు… దానికి సంబంధించిన వివరాలు ఇంకా ప్రకటించలేదు అని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.