BRS Party | సూర్యాపేట : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం సూర్యాపేటలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నిన్న మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడిన తీరు సరిగా లేదన్నారు. ఒక వీధి రౌడీలా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇలాంటి భాష ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదన్నారు. రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడేముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కేసీఆర్ వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు. ఒక వేళ తెలంగాణ ఏర్పడకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రవర్తనను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సరైన సమయంలో రేవంత్కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. నిన్న కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు.