BRS vs Congress : అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీఆర్ఎస్ నిరసనలు, కాంగ్రెస్ నేతల అక్రమ అణిచివేతలు రాష్ట్రంలో పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చాయి. కేసీఆర్ ఫామ్ హౌస్పై దాడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు గుంపులుగా వెళ్లినట్లు తెలుసుకున్న బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్రావు అప్రమత్తమయ్యారు. వారిద్దరూ పార్టీ ఇతర ఎమ్మెల్యేలతో కలిసి హుటాహుటిన అసెంబ్లీ నుంచి నేరుగా ఫామ్హౌస్కు బయలుదేరారు.
కాంగ్రెస్ నేతలు గుంపులుగా ఫామ్హౌస్ వైపు బయలుదేరుతూ.. కేసీఆర్ చావును కోరుకుంటున్నామని వ్యాఖ్యానించడంతో బీఆర్ఎస్ శ్రేణులు సీరియస్గా ఉన్నాయి. కేసీఆర్ హత్యకు కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలావుంటే “ఎంతమంది పోలీసులనైనా పంపండి, ఎంతమంది ఎమ్మెల్యేలతోనైనా రండి.. ఎవరు పైచేయి సాధిస్తారో చూద్దాం” అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు సవాల్ చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్
అసెంబ్లీ నుంచి నేరుగా కేసీఆర్ ఎర్రవల్లి నివాసానికి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కేసీఆర్ మీద కాంగ్రెస్ గుండాల హత్యాయత్నం దాడి నేపథ్యంలో హుటాహుటిన బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు
ఎంత మందిని పోలీసులని… https://t.co/2x1Uw9TKMX pic.twitter.com/5cs4d82hjp
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026