హైదరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను బీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకొన్నది. సరైన పత్రాలు లేని కారణంగా స్వతంత్య్ర అభ్యర్థి కమల నామినేషన్ను తిరస్కరిస్తున్నట్టు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ తరుఫున బరిలో నిలిచిన ముగ్గురు అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్, నవీన్కుమార్, చల్లా వెంకట్రామ్రెడ్డి నామినేషన్లను ధ్రువీకరించారు. మూడు స్థానాలకు ముగ్గురే అభ్యర్థులు పోటీలో ఉండటంతో వారి గెలుపు ఏకగ్రీవమైంది. ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది.