మహబూబాబాద్, ఆగస్టు 16: ఉద్యమంతో రాష్ర్టాన్ని సాధించుకొని ప్రజా, రైతు సంక్షేమ పథకాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ను మూడోసారి కూడా సీఎంను చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ను ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయడంతోపాటు కొత్త మండలాలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, రూ.100 కోట్లతో అభివృద్ధి, విద్యార్థుల కోసం మెడికల్, నర్సింగ్, ఇంజినీరింగ్, హార్టికల్చర్ డిగ్రీ కాలేజీలను ఇచ్చి, మెడికల్ హబ్గా మార్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా బుధవారం ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ నేతృత్వంలో 5 వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు కవిత ర్యాలీని ప్రారంభించారు.
అనంతరం నెహ్రూసెంటర్లో సీఎం కేసీఆర్ భారీ కటౌట్ ఏర్పాటు చేసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు మహబూబాబాద్ నియోజక వర్గాన్ని ఎడ్యుకేషన హబ్గా తీర్చిదిద్దినట్టు చెప్పారు. హార్టికల్చర్ డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, నర్సింగ్ కళాశాలను మంజూరు చేసి, అన్ని కాలేజీల నిర్మాణాలతోపాటు విద్యార్థులకు తరగతులు సైతం నిర్వహించేలా కేసీఆర్ కృషి చేశారని కొనియాడారు. ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టాలని కోరారు. ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీలో ఎంబీఏ కోర్సు కూడా వచ్చే విధంగా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే శంకర్నాయక్, ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ ప్రత్యేక జిల్లా ఏర్పాటు తరువాతే మహబూబాబాద్లో అభివృద్ధి పరుగులు పెట్టిందని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బిందు తదితరులు పాల్గొన్నారు.