వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణహత్యపై ఆ పార్టీ తీవ్రంగా స్పందించింది. రాజకీయ కక్షతో శ్రీధర్ రెడ్డిని హత్య చేశారనే వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వెంటనే లక్ష్మీపల్లి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అరాచక పాలనను నిరసనగా ర్యాలీ చేపట్టారు. చిన్నంబావి మండల కేంద్రంలో శ్రీధర్ రెడ్డి మృతదేహంతో రాస్తారోకో చేసి.. ర్యాలీగా లక్ష్మీపల్లి గ్రామానికి బయల్దేరారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
నిరసన ర్యాలీలో కేటీఆర్ వెంటన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బీఆరం హర్షవర్దన్రెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్రెడ్డి, నాగర్కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మన్నె క్రిశాంక్ ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అంతకుముందు మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసనగా లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. హత్యా రాజకీయాలు మానుకోవాలని.. నిందితులను శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యను నిరసిస్తూ చిన్నంబావి మండల కేంద్రంలో మృతదేహంతో రాస్తారోకో చేసి, ర్యాలీగా మృతదేహాన్ని లక్ష్మీపల్లి గ్రామానికి తీసుకెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.
నిరసన ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి శ్రీనివాస్… pic.twitter.com/BGHCMouxIU
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2024