హైదరాబాద్ : దేశంలో బీఆర్ఎస్(BRS) పార్టీ దావాణంలా వ్యాపిస్తూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందని, ప్రత్యర్థి పార్టీలకు ముచ్చమటలు పట్టిస్తుందని బీఆర్ఎస్ పార్టీ లోక్సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు(Nama Nageshwar Rao) పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్కు అమితమైన ఆదరణ లభిస్తోందన్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్(CM KCR) చేపట్టిన అభివృద్ధి కి ఆకర్షితులై మహారాష్ట్ర(Maharastra)కు చెందిన నాయకులు, ప్రజలు బీఆర్ఎస్లోకి వస్తున్నారని వెల్లడించారు.కేసీఆర్ అభివృద్ధి మోడల్ ను దేశ ప్రజలుకోరుకుంటున్నారని అన్నారు. అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్ అంటూ ఇచ్చిన నినాదం అద్భుతాలు సృష్టిస్తుందని అన్నారు. రైతుల నుంచి బ్రహ్మాండమైన స్పందన ఉందని వెల్లడించారు.
తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు(Raitu Bandu) , రైతు బీమా(Raitu Beema), 24 గంటల ఉచిత కరెంట్, సాగు, తాగు నీటి వంటి రైతు పథకాల పట్ల మహారాష్ట్ర రైతాంగం మక్కువ చూపిస్తున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ విస్తరణ పెరగడంతో అక్కడి సర్కార్ లో గుబులు మొదలయిందని అన్నారు.
మరో వైపు పార్టీ శాశ్వత కార్యాలయాల ఏర్పాటు దిశగా కార్యాచరణ ఆరంభమైందని ఆయన తెలిపారు. అందులో భాగంగా అతి త్వరలోనే మహారాష్ట్ర , ఏపీ(AP), ఒడిశా(Odisa), తదితర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు(Offices) ఏర్పాటు కానున్నాయని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లోని పార్టీ కార్యాలయాలు న్యూఢిల్లీ, హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయాలతో అనుసంధిస్తారని నామ స్పష్టం చేశారు.