Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కారు దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. 13 రౌండ్లు ముగిసే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. 13వ రౌండ్లో ప్రభాకర్ రెడ్డికి 4,878 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి 1,059, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 2,273 ఓట్లు వచ్చాయి. మొత్తంగా కొత్త ప్రభాకర్ రెడ్డి 40,998 ఓట్లతో ముందంజలో ఉన్నారు.