Green India Challenge | హైదరాబాద్ : హరిత భారతదేశాన్ని సృష్టించడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను కొనసాగిస్తామని గ్రీన్ ఇండియా వ్యవస్థాపకులు, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు, మొక్కలు నాటడం ద్వారా మన ప్రకృతిని కాపాడుకునేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు. పుట్టినరోజు సందర్భంగా గురువారం ఎర్రవల్లి నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా పాల్గొని సిల్వర్ ఓక్ మొక్కను నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టినరోజుతో పాటు, సందర్భం ఏదైనా మొక్కలు నాటే సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, శ్రవణ్రెడ్డి, కిషోర్గౌడ్ తదితరులు ఉన్నారు.